: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్!

టెస్టులు, వన్డేల్లో కలిసి వచ్చిన టాస్ టీ20 సిరీస్ లో భారత్ కు కలిసిరాలేదు. దీంతో ఈ సిరీస్ లో ఇప్పటి వరకు టాస్ ఒక్కసారి కూడా భారత్ గెలవలేదు. దీంతో తొలుత భారత్ బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. ఇది భారత్ కు ప్రతికూలంగా మారుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్యాట్స్ మన్ స్కోరును బౌలర్లు కాపాడాల్సి వస్తోంది. శీతాకాలం కావడంతో సాయంత్రం అయ్యేసరికి మైదానంలో మంచుదుప్పటి కప్పుకుంటోంది. దీంతో బంతిపై బౌలర్లకు సరైన పట్టు దొరకడం లేదు. పర్యవసానంగా టీమిండియా బౌలర్లు వికెట్ల వేటలో విఫలమవుతున్నారు. ఈ మ్యాచ్ టైటిల్ పోరు కావడంతో రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ ఇంగ్లండ్ వైపు మొగ్గుచూపింది. దీంతో మరోసారి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కాసేపట్లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టులో మనీష్ పాండే స్థానంలో కీపర్ రిషబ్ పంత్ ను తీసుకోనుండగా, ఇంగ్లండ్ జట్టు ప్లంకెట్ స్థానంలో డౌసన్ ను జట్టులోకి తీసుకోనుంది. 

More Telugu News