: దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి, హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇళ్లలో ఐటీ దాడులు!

దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి, సినీ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధించడంతో దానిపై వచ్చిన ఆదాయానికి సంబంధించిన లెక్కల కోసమే హైదరాబాద్ లోని వారి ఇళ్లలో ఐటీ అధికారులు దాడి చేసి ఉంటారని తెలుస్తోంది. కాగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై  హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పలు చిత్రాలను నిర్మించారు. తాజాగా, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తెలంగాణలో సుధాకర్ రెడ్డి పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని సుధాకర్ రెడ్డి కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
 

More Telugu News