kohli: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ!

తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి ప‌డిపోయాడు.
గాయంతో కొంత కాలం నుంచి క్రికెట్‌కు దూరమైన మ‌రో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ మూడు ర్యాంకులు కోల్పోయి 12వ స్థానంలో నిలిచాడు. ఆ త‌రువాతి స్థానంలో మ‌హేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ఇక‌ భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ సంయుక్తంగా 14వ ర్యాంకులో కొన‌సాగుతున్నారు.
 
ఇటీవ‌ల త‌మ దేశంలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ర్యాంకింగ్స్‌లో త‌న‌ కెరీర్‌లోనే మొద‌టిసారి తొలి ర్యాంకును ద‌క్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్ ఒక స్థానం కోల్పోయి రెండో స్థానానికి దిగ‌జారాడు. ఇక‌ బౌలింగ్‌ విభాగంలో టీమిండియాకు బౌల‌ర్ ఒక్క‌రు కూడా టాప్‌-10లో క‌నపడ‌లేదు. అక్షర్‌పటేల్‌కి 12వ స్థానం ద‌క్కగా అమిత్‌మిశ్రా 14, అశ్విన్‌ 19 ర్యాంకుల్లో కొన‌సాగుతున్నారు. ఇక‌ జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 1, సౌతాఫ్రికా 2 స్థానాల్లో ఉండ‌గా టీమిండియా మూడో ర్యాంకులో ఉంది.

More Telugu News