special status: రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతా: పవన్ కల్యాణ్

ప్ర‌త్యేక హోదా కోసం విశాఖప‌ట్నంలో నిర్వ‌హించత‌ల‌పెట్టిన శాంతియుత నిర‌స‌న‌ను ప్ర‌భుత్వం పోలీసుల సాయంతో అడ్డుకున్న నేప‌థ్యంలో సినీన‌టుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఉద‌యం నుంచి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లువురు విద్యార్థులు, పార్టీల‌ కార్య‌క‌ర్త‌లను పోలీసులు అరెస్టు చేసిన నేప‌థ్యంలో వారిని విడుద‌ల చేయాల‌ని ట్వీట్ చేసిన ప‌వ‌న్ తాజాగా... మ‌రోసారి ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ స్పెష‌ల్ స్టేష‌న్ పోరాటం అంశం గురించి మాట్లాడేందుకు రేపు మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రేపు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల మ‌ధ్య తాను మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్‌ పేర్కొన్నారు.


More Telugu News