kohli: స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల‌పై ప్రతి ఒక్కరూ స్పందించాలి: విరాట్ కోహ్లీ సందేశం

భారత దేశం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో త‌న ఫాలోవ‌ర్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు. దేశంలోని ప్ర‌తి పౌరుడు సానుకూల మార్పు కోసం ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న పేర్కొన్నాడు. స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌ల‌పై అంద‌రూ స్పందించాల‌ని అన్నాడు. అంద‌రం క‌లిసి దేశాన్ని అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న పిలుపునిచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చిన్న‌నాటి గుర్తులు త‌న అభిమానుల‌తో పంచుకుంటూ.. త‌న బాల్యంలో ఇండియా గేట్ ద‌గ్గ‌ర ప‌రేడ్‌కు జెండా ప‌ట్టుకొని వెళ్లేవాడిన‌ని చెప్పాడు.

More Telugu News