cricket: 200 మార్కుదాటిన ఇంగ్లండ్ స్కోరు

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య  కోల్‌క‌తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న ఇంగ్లండ్ టీమ్ స్కోరు 200 ప‌రుగుల మార్కును దాటింది. భార‌త బౌల‌ర్‌ జ‌డేజా చేతిలో బిల్లింగ్స్, జేజే రాయ్ వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన మోర్గాన్ 43 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో బయిర్ స్ట్రో 41, బ‌ట్ల‌ర్ 7 ప‌రుగుల‌తో ఉన్నారు. ఇంగ్లండ్ స్కోరు 36 ఓవ‌ర్లకి 203/3 గా ఉంది. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌డేజా 2, పాండ్యా 1 వికెట్టు తీశారు.

More Telugu News