: ఉగ్ర సంస్థ లష్కరే తాయిబాకు ఊహించని ఎదురుదెబ్బ!

మన దేశంలో పలు దాడులకు తెగబడిన ఉగ్ర సంస్థ లష్కరే తాయిబాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ముష్కర మూకల సంస్థ అధినేత అయిన లఖ్వీ మేనల్లుడు, టాప్ కమాండర్ అబూ ముసాయిబ్ ను మన భద్రతా దళాలు హతమార్చాయి. జమ్ముకశ్మీర్ లోని బందిపొరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో అబూ మృతి చెందాడు. అతని వద్ద నుంచి ఏకే47ను సైన్యం స్వాధీనం చేసుకుంది.   

More Telugu News