kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర‌వింద్ కేజ్రీవాల్‌కి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ రోజు నోటీసులు జారీ చేసింది. వ‌చ్చేనెల‌ గోవాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలోనూ త‌మ పార్టీని విస్త‌రించుకునేందుకు కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆ రాష్ట్రంలో ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ నెల 8న గోవాలో నిర్వ‌హించిన సభ‌లో ఆయ‌న ఈసీ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించారని, దానిపై వివ‌ర‌ణ చెప్పుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘం కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌లోపు ఆయ‌న వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సూచించింది.

More Telugu News