demonitization: రూ.6.1 ల‌క్ష‌ల విలువచేసే రూ.500, 2000 న‌కిలీ నోట్ల గుర్తింపు

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో అవ‌స్థ‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు న‌కిలీ నోట్ల భ‌యం ప‌ట్టుకుంది. కొత్త‌గా వ‌చ్చిన 500, 2000 రూపాయ‌ల‌ నోట్ల ఫీచ‌ర్ల‌పై ప్ర‌జ‌లు ఇంకా సరైన అవ‌గాహ‌న పెంచుకోలేదు. ఇదే అదునుగా కొంద‌రు కేటుగాళ్లు రెచ్చిపోయి న‌కిలీ నోట్ల‌ను ముద్రిస్తూ వాటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పోలీసులకు చిక్కి జైలుకి వెళుతున్నారు. ఈ రోజు ఉద‌యం ఢిల్లీలో కంప్యూట‌ర్ల ద్వారా న‌కిలీ నోట్లు ముద్రిస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6.1 ల‌క్ష‌ల విలువచేసే 500, 2000 న‌కిలీ నోట్లు ఉన్న‌ట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News