: ఈ ఉదయం యోగా మానేశా.. అమ్మ వద్దకు వెళ్లా: మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఉదయం యోగా చేసిన తర్వాతే తన రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న ఆయన... ఈ ఉదయం యోగా చేయడం మానేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తల్లి హీరాబెన్ ను కలిసేందుకు వెళ్లానని.. ఆమెతో కలసి టిఫిన్ చేశానని చెప్పారు. మోదీ తల్లి ప్రస్తుతం గాంధీనగర్ శివారులో ఆయన సోదరుడు పంకజ్ మోదీ ఇంట్లో ఉంటున్నారు.

తన సోదరుడి ఇంటికి వెళ్లిన మోదీ... కుటుంబసభ్యులందరితో కాసేపు సరదాగా గడిపారు. తనకు దొరికిన అతి కొద్ది సమయాన్ని వారితో ఆనందంగా గడిపారు. తన తల్లితో విలువైన సమయాన్ని గడిపానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే 'వైబ్రంట్ గుజరాత్' సదస్సును నేడు మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు దాదాపు 500 సంస్థల సీఈవోలు హాజరుకానున్నారు.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Skipped Yoga & went to meet mother. Before dawn had breakfast with her. Was great spending time together.</p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/818638247165247488">January 10, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News