cricket: వ‌చ్చే నెల 13 నుంచి ఉప్ప‌ల్ స్టేడియంలో టెస్టు మ్యాచు!

వ‌చ్చే నెల 13 నుంచి జ‌ర‌గ‌నున్న‌ బంగ్లాదేశ్‌, టీమిండియా టెస్టు మ్యాచుకు హైద‌రాబాద్‌, ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ వేదిక కావ‌డం లేదంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌ కార్య‌ద‌ర్శి కే.జాన్ మ‌నోజ్ కొట్టిపారేశారు. ఆ స్టేడియంలోనే మ్యాచు జ‌రుగుతుంద‌ని, ప్ర‌క‌ట‌న‌ల‌ కోసం టెండ‌ర్లు కూడా ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. ఈ మ్యాచు కోసం తాము ట్వంటీ ఫ‌స్ట్ సెంచ‌రీ మీడియాతో ఒప్పందం సైతం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆ టెస్టు మ్యాచుకు ముందే బంగ్లాదేశ్ జ‌ట్టు న‌గ‌రానికి వ‌చ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు, వార్మ‌ప్ మ్యాచ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

More Telugu News