cricket: మరో రెండు స్థానాలు దిగజారిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్!

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫ‌లం చెంది 0-3తో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరో రెండు స్థానాలు దిగజారిపోయింది. ప్ర‌స్తుతం పాక్ ఐదో స్థానంలో ఉంది. గ‌త ఏడాది ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ మొద‌టి స్థానంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత క్ర‌మంగా చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తూ కొన్ని నెల‌ల్లోనే మూడో ర్యాంకుకు దిగజారింది. ప్ర‌స్తుతం మ‌రో రెండు స్థానాలు కోల్పోయింది.

ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌ను పాకిస్థాన్ ఏ మాత్రం ఎదుర్కోలేక‌పోయింది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో ఆడిన‌ పాకిస్థాన్ జ‌ట్టు అప్పుడు కూడా టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. కెప్టెన్‌ మిస్బావుల్ త‌న కెరీర్‌లో చివరగా ఆడిన ఆరు టెస్టుల్లోనూ పాక్ ఓట‌మిపాల‌యింది. మ‌రోవైపు టీమిండియా 120 పాయింట్లతో మొద‌టి స్థానంలో ఉంది. 109 పాయింట్లతో భార‌త్ త‌రువాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆ త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే జ‌ట్లు ఉన్నాయి.

More Telugu News