: కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనసభాపక్షం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. శాసనసభను పక్కదారి పట్టిస్తున్నారని పేర్కొంటూ ఇచ్చిన ఈ నోటీసును స్పీకర్ మధుసూదనాచారికి అందజేసింది. ఈ నోటీసుపై కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు సంతకాలు చేశారు. 2016 మార్చి 29న అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన సీఎం కేసీఆర్, 2016 ఏప్రిల్ నాటికి మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు చెల్లిస్తామని సభకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ పై సభను తప్పుదారి పట్టించారని ఆ నోటీసులో పేర్కొన్నారు. ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ నిధులు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పిన కేసీఆర్, ఈ నెల 4వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ, వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడం సాధ్యం కాదని చెప్పారన్నారు. ఇదే విషయమై సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన దానికి, ఇప్పుడు చెబుతున్న దానికి ఏమాత్రం పొంతనలేదని నోటీసులో పేర్కొన్నారు.  

More Telugu News