assembly: ప్రభుత్వ తీరుకి నిరసన... అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం సభ్యులు

తెలంగాణ‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిలను విడుద‌ల చేయ‌డంలో స‌ర్కారు నిర్ల‌క్ష్య వైఖ‌రి అవ‌లంబిస్తూ విద్యార్థులకు న‌ష్టం క‌లిగిస్తోంద‌ని ఆరోపిస్తోన్న కాంగ్రెస్‌, టీడీపీ నేత‌లు త‌మ నిర‌స‌న‌ను ఈ రోజు కూడా కొనసాగించారు. ఈ రోజు శాసనసభ నుంచి కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స‌భ‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నామని అన్నారు. అయితే స‌ర్కారు చెప్పిన సమాధానాలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌తిప‌క్ష స‌భ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు. ప్ర‌తిప‌క్షాల తీరుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ వారు వాకౌట్‌ చేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు.

More Telugu News