suicide: ప్రిన్సిపాల్ వేధింపులు... కళాశాల భవనం పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

సిద్ధిపేటలోని సాయిచైతన్య జూనియ‌ర్‌ కళాశాలలో ఈ రోజు ఉద‌యం విషాదం చోటుచేసుకుంది. క‌ళాశాల భ‌వ‌నంలోని నాలుగో అంత‌స్తు నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం క‌ల‌క‌లం రేపింది. ఆ విద్యార్థినిని వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లినా, అప్ప‌టికే ఆ విద్యార్థిని మృతి చెందింద‌ని వైద్యులు చెప్పారు. మృతురాలు ఆ కాలేజీలో ఇంట‌ర్ సెకండియ‌ర్‌ విద్యార్థిని భ‌వానిగా పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థిని కొంత‌కాలంగా స‌ద‌రు కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి వేధింపులు ఎదుర్కుంటోంద‌ని అక్క‌డ‌కు చేరుకున్న విద్యార్థి సంఘాలు చెప్పాయి. ప్రిన్సిపాల్‌ని వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News