: ధోనీ నిర్ణయం సబబేనా? టైమ్స్ నిర్వహించిన పోల్ ఫలితమిది!

భారత క్రికెట్ జట్టుకు వన్డేలు, టీ-20 కెప్టెన్ గా రిటైర్ మెంటు ప్రకటించిన తరువాత 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక పోల్ ను నిర్వహించింది. ధోనీ నిర్ణయం సరైనదేనా? అన్న ప్రశ్నకు 64 శాతం మంది సరైనదేనని సమాధానం ఇవ్వగా, 36 శాతం మంది ఇప్పట్లో ధోనీ తన కెప్టెన్సీని వదులుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. కాగా, గత కొంత కాలంగా మ్యాచ్ ఫినిషర్ గా నిలవలేకపోతున్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రీడాభిమానులను ఆశ్చర్యపరుస్తూ తన హోదాను వదులుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News