suicide: ఒంటికి నిప్పంటించుకుని బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న టీచర్.. ప్రేమ వ్యవహారమే కారణం!

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన ఓ వ్య‌క్తి, మంటలకు తాళలేక నాలుగో అంతస్తుపై నుంచి దూకి మరణించిన ఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జ‌రిగింది. అదే ప్రాంతానికి చెందిన శంకరబ్రహ్మ (28) ఓ ప్రైవేటు పాఠశాలలో టీచ‌ర్‌గా పనిచేస్తున్నాడని, త‌న‌ ప్రేమ వ్య‌వ‌హారంలో ఇబ్బందుల‌ను ఎదుర్కోలేక‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అత‌డి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామ‌ని చెప్పారు.

More Telugu News