arrests: కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేల‌ అరెస్ట్ .. ఆయా పార్టీల కార్యాలయాలకు తరలింపు!

ఫీజు రీయింబర్స్ మెంటుపై శాస‌న‌సభలో తాము మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని ప్రతిపక్ష కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం ఎమ్మెల్యేలు సభ లోపలే బైఠాయించి, నిర‌స‌న కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. స‌భ‌లోనే నిర‌స‌న‌కు దిగిన ఎమ్మెల్యేలంద‌రినీ మార్షల్స్  బయటకు తీసుకురాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను గాంధీభ‌వ‌న్ కు త‌ర‌లించారు. ఇక టీడీపీ శాస‌న‌స‌భ్యుల‌ను ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌కు త‌ర‌లించారు. ఫీజులపై తాము అడిగిన‌ ప్రశ్నలకు రాష్ట్ర స‌ర్కారు స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు డిమాండ్ చేశారు.

More Telugu News