attack: బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్న బాగ్దాద్‌.. మరో ఉగ్రదాడి.. 17 మంది మృతి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్ ఉగ్ర‌దాడుల‌తో ద‌ద్ద‌రిల్లిపోతోంది. ఉగ్ర‌వాదులు వ‌రుస‌గా చేస్తోన్న దాడులతో అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ బ‌తుకుతున్నారు. రెండు రోజుల క్రితం సెంట్రల్‌ బాగ్దాద్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 27 మంది మృత్యువాతపడిన ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే ఈ రోజు మ‌రోసారి ఉగ్ర‌దాడి జ‌రిగింది. బాగ్దాద్‌కు ఈశాన్యంలోని సదర్‌ నగరంలో గుమికూడి ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కారు నిండా బాంబులతో వెళ్లి ఆత్మాహుతి దాడికి దిగాడు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా 39 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో బాధితులంతా రోజువారి కూలీలు, శ్రామికులని అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ దాడి చేసింది తామేన‌ని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. కాగా, ఇక్క‌డ ఇస్లామిక్‌ స్టేట్ త‌రుచుగా దాడులు జ‌రుపుతోంది.

More Telugu News