: సమయం ఆసన్నమైంది.. ఇక బై చెబుతా!: మిస్బా ఉల్ హక్

గత 15 సంవత్సరాలుగా పాకిస్థాన్ క్రికెట్ కు ఎంతో సేవ చేసిన స్టార్ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తన కెరియర్ కు ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. మిస్బా సారథ్యంలో పాక్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. సిడ్నీలో చివరిదైన మూడో టెస్టు ముగిసిన తర్వాత తన రిటైర్మెంటును మిస్బా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మిస్బా మాట్లాడుతూ, వాస్తవానికి తాను ఎప్పుడో రిటైర్ కావాల్సి ఉందని.. కానీ, కొన్ని కారణాల వల్ల జట్టులో కొనసాగాల్సి వచ్చిందని తెలిపాడు. ఇక సమయం ఆసన్నమైందని... రిటైర్ అవుతానని చెప్పాడు. మూడో టెస్టుకు ముందుకాని లేదా తర్వాత కానీ రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడు. 

More Telugu News