: ఈ ఏడాది ‘యశ్ చోప్రా’ జాతీయ అవార్డుకు షారూక్ ను ఎంపిక చేశాం: టి. సుబ్బరామిరెడ్డి

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ను ఈ ఏడాది 'యశ్ చోప్రా' జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ అధ్యక్షుడు డా. టి. సుబ్బరామిరెడ్డి  పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి 25న ముంబై లోని హోటల్ మారియట్ లో జరగనున్న ఓ వేడుకలో  ‘యశ్ చోప్రా' 4 వ జాతీయ అవార్డును  ఆయనకు బహూకరించనున్నట్లు తెలిపారు. దివంగత యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీకపూర్ తో కూడిన సభ్యుల కమిటీ ఈ ఏడాది ‘యశ్ చోప్రా’ అవార్డుకు షారూక్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఈ వేడుకకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటీనటులు రేఖ, శ్రీదేవి, రాణి ముఖర్జీ, ఐశ్వర్య రాయ్, జయప్రద, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఇతర సినీ నటులు పాల్గొననున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, బాలీవుడ్ లెజెండరీ దర్శక నిర్మాత యశ్ చోప్రా మరణానంతరం ఆయన పేరిట టి.ఎస్.ఆర్. ఫౌండేషన్ జాతీయ అవార్డు ఇస్తోంది. ఈ అవార్డు పేరిట 10 లక్షల రూపాయల నగదు, బంగారు పతకం, ప్రశంసా పత్రంను అవార్డు గ్రహీతకు అందజేస్తారు. గతంలో ఈ అవార్డును సుప్రసిద్ధ  గాయని లతా మంగేష్కర్, ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, నటి రేఖ అందుకున్నారు. 

More Telugu News