: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి  పర్వదినాల్లో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఆయా పర్వదినాల్లో వీఐపీలు స్వయంగా వస్తే టికెట్లు కేటాయిస్తామని, ఒక్కో వీఐపీ టికెట్ ధర రూ.1000 అని పేర్కొన్నారు. కొత్త ఏడాది జనవరి 8, 9 తేదీల్లో నడకదారి భక్తులకు దివ్యదర్శన టోకెన్లను రద్దు చేసినట్లు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. 

More Telugu News