: జనవరి 1న కోహ్లీ, అనుష్కల నిశ్చితార్థం?

సెలబ్రిటీ లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ ప్రేమని మరో మెట్టుకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న వీరిద్దరి నిశ్చితార్థం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ తమతమ కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. అక్కడున్న నరేంద్రనగర్ లోని ఆనంద హోటల్ లో వీరి నిశ్చితార్థం జరగనున్నట్టు సమాచారం. ఈ వేడుకకు అంబానీ, బచ్చన్, కపూర్ల కుటుంబాలతో పాటు పలువురు క్రికెట్, బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం కావాల్సిన ఏర్పాట్లను అనుష్క కుటుంబీకులు మొదలు పెట్టేశారట. అయితే, ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించకపోవడంతో... కొంత సస్పెన్స్ నెలకొంది. 

More Telugu News