: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం, మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ప్రణబ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, శ్రీవారి శేష వస్త్రంతో ప్రణబ్ ను సత్కరించి. తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి శ్రీవేంకటేశ్వరుని చిత్రపటం, క్యాలెండర్, డైరీని ఆలయ అధికారులు అందజేశారు. అంతకుముందు, వరాహస్వామిని ప్రణబ్ దర్శించుకున్నారు. కాగా, రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, ఇతర అధికారులు ఉన్నారు.

More Telugu News