: ముసద్దీలాల్ నగల దుకాణం ఎండీ అరెస్టు

తప్పుడు బిల్లులతో రూ.100 కోట్ల విలువైన బంగారం విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని ముసద్దీలాల్ నగల దుకాణం యజమానిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారులో ముసద్దీలాల్ ఎండీ కైలాస్ చంద్ గుప్తా, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. 5,200 మంది వినియోగదారులకు బంగారం విక్రయించినట్లు కైలాస్ గుప్తా తప్పుడు బిల్లులు సృష్టించారని ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

More Telugu News