chandrababu: సీఎం చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా టీమ్‌తో వెళ్లేందుకు సిద్ధం: ఉమాభార‌తి

పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌ని, సీఎం చంద్రబాబు ఎప్పుడు పిలిస్తే అప్పుడు త‌న‌ టీమ్‌తో ఏపీకి వెళ్లి ఆ ప్రాజెక్టు ప‌నుల గురించి తెలుసుకొని, సాయం అందించేందుకు సిద్ధమ‌ని కేంద్ర మంత్రి ఉమాభార‌తి అన్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా పోల‌వ‌రం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును చంద్ర‌బాబు నాయుడు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉమాభార‌తి మాట్లాడుతూ.. పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్టిందని, ప్రాజెక్టుకు నిధుల సాధ‌న విష‌యంలో కేంద్రమంత్రి సుజ‌నాచౌద‌రి ప్ర‌త్యేక చొర‌వ చూపారని ఆమె అన్నారు. పోల‌వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల ద్వారా 80 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌ని తాము ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ఆమె చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి చంద్ర‌బాబు నాయుడు శ్ర‌మిస్తున్నార‌ని ఆమె కొనియాడారు.

More Telugu News