demonitisation: కెనరా బ్యాంకు నుంచి రూ.37 లక్షలు చోరీ... వాటిలో రూ.10.5 లక్షల విలువైన కొత్తనోట్లు

పెద్దనోట్ల రద్దుతో భారీ సంఖ్యలో వస్తోన్న ఖాతాదారుల ఒత్తిడికి తోడు బ్యాంకులకు మరో భయం కూడా పట్టుకుంటోంది. బ్యాంకుల్లో చోరీ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హరియాణా రాష్ట్రంలోని భివాని ప్రాంతంలోని కలాన్ కెనరా బ్యాంక్ శాఖలో ఈ రోజు భారీ చోరీ జరిగింది. ఈ విషయంపై ఆ బ్యాంకు సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. బ్యాంకులో మొత్తం  రూ.37లక్షలు చోరీకి గురయ్యాయ‌ని చెప్పారు. వాటిలో రూ.10.5లక్షల విలువైన కొత్తనోట్లు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ చోరీపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News