demonitisation: ఏటీఎం క్యూ లైన్లలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసిన యూపీ సీఎం

పెద్దనోట్ల రద్దు నేప‌థ్యంలో దేశంలోని ప‌లు ఏటీఎంల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిలబడి ప‌లువురు మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఏటీఎంల వ‌ద్ద మృతి చెందిన వారి కుటుంబాల‌కు ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ప‌రిహారంగా చెక్కులు అందించారు. ఈ సంద‌ర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. కేంద్ర స‌ర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది మృతి చెందాల్సి వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు తాము నష్టపరిహారం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బీజేపీ ప్ర‌చారం చేసుకుంటున్న‌ అచ్చే దిన్ క‌ల మాదిరిగానే ఇప్పుడు న‌గ‌దుర‌హిత‌ ఆర్థిక‌వ్య‌వ‌స్థ అంటూ క‌ల‌ల్లో విహ‌రిస్తోందని ఆయ‌న విమ‌ర్శించారు. బీజేపీ నేత‌లు ఎప్పుడు నేల‌పైకి దిగుతారో తెలియ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.

More Telugu News