arrests: గుజరాత్ లో పెళ్లి విందులో మ‌ద్యం తాగుతూ చిందులు .. 200 మంది అరెస్ట్

సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న గుజ‌రాత్‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా అవ‌డం క‌ల‌క‌లం రేపింది. భారీ ఎత్తున మ‌ద్యాన్ని దిగుమ‌తి చేసుకొని ప‌లువురు ఫామ్‌హౌజ్‌లో ఎంచ‌క్కా పార్టీ చేసుకుని చిందులేశారు. ఆ రాష్ట్రంలోని వ‌డోద‌ర‌లో జ‌రుగుతున్న ఈ పార్టీపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని దాడులు నిర్వ‌హించారు. ఏకంగా 200 మందిని అదుపులోకి తీసుకుని, ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ పెళ్లి విందులో అక్ర‌మంగా మ‌ద్యం స‌ర్వీసు చేశార‌ని, నిందితుల‌ని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు మీడియాకు తెలిపారు.

More Telugu News