demonitization: పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొనడానికి సిద్ధమైన కేజ్రీవాల్

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై మొద‌టి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త తెలుపుతున్న కేజ్రీవాల్ కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో క‌లిసి నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న వ‌రుస ర్యాలీలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా రేపు ఆయ‌న‌ జైపూర్‌లో ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజస్థాన్ ఆప్ శాఖ ప్రతినిధి నితిన్ త్యాగి మీడియాకు తెలిపారు.  అనంత‌రం కేజ్రీవాల్‌ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ర్యాలీల్లో పాల్గొంటారని ఆయన వెల్ల‌డించారు. ఆయ‌న‌తో పాటు ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మనీశ్‌సిసోడియా, పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా, ఎమ్మెల్యే అల్కా లంబా కూడా ఈ ర్యాలీల్లో పాల్గొని పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం ఏర్ప‌డిన ప‌రిస్థితిపై నిర‌స‌న తెలుపుతార‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News