: తమిళనాడు సీఎస్ తొలగింపు... గిరిజకు బాధ్యతలు

తమిళనాడు చీఫ్ సెక్రటరీగా రామ్మోహన్ రావును తొలగిస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఆయన ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతుండటం, వాటిల్లో పెద్దఎత్తున నగదు, బంగారం పట్టుబడటంతోనే రామ్మోహన్ రావును తప్పిస్తూ పన్నీర్ సెల్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా 1981వ బ్యాచ్ కు చెందిన గిరిజా వైద్యనాథన్, ప్రస్తుతం భూ పరిపాలనా విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

ఇదిలావుండగా, ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి అనుచరులైన ప్రేమ్ కుమార్, రత్నం, రామచంద్రన్ లను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరు పరుచగా, జనవరి 4 వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.

More Telugu News