demonitisation: ఏపీలో సామాజిక భ‌ద్ర‌త పింఛ‌న్‌దారుల‌కు ఊర‌ట‌.. డ‌బ్బు విత్ డ్రా ప‌రిమితిని ఎత్తివేసిన ఆర్‌బీఐ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సామాజిక భ‌ద్ర‌త పింఛ‌న్‌దారుల‌కు ఊర‌ట ల‌భించింది. బ్యాంకుల నుంచి వారికి న‌గ‌దు విత్ డ్రా ప‌రిమితిని ఎత్తివేస్తున్న‌ట్లు  రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది. రెండు రోజులుగా ఈ అంశంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్‌బీఐ అధికారుల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు జ‌రిపారు. పింఛ‌న్ ఇబ్బందుల‌ను ఆయ‌న వారికి వివ‌రించి చెప్పారు. ఫ‌లితంగా ఆర్‌బీఐ నుంచి సానుకూల ప్ర‌క‌టన వ‌చ్చింది. పింఛ‌న్‌ల‌కు అవ‌స‌ర‌మైన న‌గ‌దు విత్ డ్రాకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఆర్‌బీఐ క‌ల్పించిన వెసులుబాటును ఉప‌యోగించు‌కోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు సూచించారు.

More Telugu News