: శబరిమలలో దొంగల హల్‌చల్.. బిక్కుబిక్కుమంటున్న తెలుగు భక్తులు

పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశంలోని కార్లను ధ్వంసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులకు చెందిన కార్ల అద్దాలను ధ్వంసం చేసిన దొంగలు మూడు సెల్‌ఫోన్లు, నగదు దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి భక్తుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More Telugu News