kejriwal: బీజేపీ నేతలు ఎంత డబ్బయినా విత్ డ్రా చేసుకోవచ్చా?: కేజ్రీవాల్ ఆగ్రహం

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌రోసారి బీజేపీ నేత‌ల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ రోజు న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... బ్యాంకుల్లో రూ.24 వేలు మాత్రమే తీసుకోవాల‌న్న నిబంధ‌న బీజేపీ నేత‌లకు వ‌ర్తించ‌దా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా బ్లాక్ మ‌నీని మార్చుకుంటున్నార‌ని ఆరోపించారు. సామాన్యులు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే వారి వివ‌రాలు అడుగుతారని, మ‌రి బీజేపీ పెద్ద‌ల‌కు ఆ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వా? అని అడిగారు. బీ‌జేపీ నేత‌లు ఎంత మొత్తాన్న‌యినా విత్ డ్రా చే‌సుకోవచ్చా? అని ప్ర‌శ్నించారు. అలాగే రాజ‌కీయ పార్టీల‌కు ప‌లువురు ఫండ్‌లు ఇచ్చిన అంశంపై ఓ క‌మీష‌న్‌ను ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

More Telugu News