kishan reddy: పవన్ కల్యాణ్ కి ఇప్పుడు గుర్తుకొచ్చిందా?: జనసేనాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

భార‌తీయ జ‌న‌తా పార్టీపై జ‌న‌సేనాని, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లను గురి పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ఐదు అంశాలు బీజేపీ ముందు ఉంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ప్ర‌శ్న‌లు అడిగి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. కొన్ని నెల‌ల క్రితం హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రోహిత్ వేముల గురించి ఈ రోజు ఆయ‌న బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ తెలంగాణ నేత కిష‌న్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు లెక్క‌లోకి తీసుకోబోమ‌ని అన్నారు. ఇన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న ప‌వ‌న్ ఇప్పుడు ఎందుకు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాత్రికి రాత్రే  ప‌వ‌న్‌కి ఎవ‌ర‌యినా ఉప‌దేశం ఇచ్చారా? అని కిషన్ రెడ్డి అడిగారు. ఆయా అంశాల‌పై స‌మ‌స్య ఉన్న‌ప్పుడు మాట్లాడ‌ని ప‌వ‌న్ ఇప్పుడు మాట్లాడ‌డంలో ఆంతర్యం ఏంట‌ని అన్నారు.  ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, మీడియాలో దేనిలో క‌న‌ప‌డి ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేసినా తాము ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఖాత‌రు చేయ‌బోమ‌ని అన్నారు. రోహిత్ వేముల గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యంపై ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు మాట్లాడితే స్పందించేవాళ్ల‌మ‌ని ఇప్పుడు స్పందిచ‌బోమ‌ని అన్నారు. ఆ అంశంపై బీజేపీ ఎప్పుడో స‌మాధానం చెప్పిందని,  ఓ వైపు రోహిత్ వేముల అంశాన్ని అంద‌రూ మ‌ర్చిపోతుంటే, వ‌ప‌న్‌కి ఇప్పుడు గుర్తు కొచ్చిందని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు జ‌వాబు చెప్పాల్సిన అవ‌స‌రం లేదని అన్నారు.

More Telugu News