: శ్వాసకోస సమస్యతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి శ్వాసకోస సమస్యతో ఆసుపత్రిలో చేరారు. శ్వాసతీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతుండడంతో ఆయనను కావేరీ ఆసుపత్రిలో చేర్చారని వైద్యులు తెలిపారు. అయితే ఆయన మరణించారంటూ వందతులు వ్యాపించడంతో  కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. గొంతు, శ్వాసకోస సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. 

More Telugu News