: పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ను నేను ఏనాడూ సమర్థించలేదు: కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి

పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ను తాను ఏనాడూ సమర్థించలేదని, ఈ ప్రాజెక్టును సమర్థిస్తున్నట్లుగా తన పేరుతో ఒక దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని తాను రాయలేదని స్పష్టం చేశారు. ఆ పత్రికలో వచ్చిన వ్యాసం కనుక తాను రాసినట్లు నిరూపిస్తే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేయకుండా కేసీఆర్ విస్మరిస్తున్నారని అన్నారు. ‘పాలమూరు’, ‘రంగారెడ్డి’ ప్రాజెక్టుల అంచనాలను కేసీఆర్ సర్కార్ తన ఇష్టానుసారం పెంచిందని విమర్శించారు. ఈ సందర్భంగా నాడు కేసీఆర్ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. తెలంగాణకు ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయకపోతే తన తల నరుక్కుంటానని నాడు హామీ ఇచ్చిన కేసీఆర్, అధికారంలోకి రాగానే ఆ మాటే మరిచారని మండిపడ్డారు.

More Telugu News