: మరో బాంబేసిన ‘లీజియిన్’ గ్రూప్.. తాము నోరు తెరిస్తే భారత్‌లో కల్లోలమేనని ప్రకటన.. ‘అపోలో ’ వివరాలున్నాయంటూ సంచలనం

దేశంలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన ‘లీజియన్’ గ్రూప్ తాజాగా మరో బాంబు పేల్చింది. అపోలో ఆస్పత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని, అందులో భారత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుల డేటా ఉందని పేర్కొంది. దానిని కానీ బయటపెడితే భారత్‌లో కల్లోలం తప్పదని స్పష్టం చేసింది.

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ప్రకటన సంచలనం  సృష్టిస్తోంది. ‘అమ్మ’ చివరి క్షణంలో అపోలో కేంద్రంగా రాజకీయాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీజియన్ ప్రకటన తీవ్ర సంచలనమైంది. భారత సర్వర్ల నుంచి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా తమ వద్ద ఉందని లీజియన్ వివరించింది.  భారత్‌లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న లీజియన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా, జర్నలిస్టు బర్ఖాదత్, రవిష్ కుమార్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసింది. కాగా తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అని చెప్పిన లీజియన్ ప్రతినిధి అక్రమార్కుల వివరాలిస్తే మరిన్ని హ్యాక్‌లు చేస్తామని వెల్లడించింది.

More Telugu News