: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండు స్కోరు 182/6

ముంబైలో భారత్-ఇంగ్లాండుల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 182 పరుగులు చేసింది. ఈరోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జెన్నింగ్స్(0), కుక్ (18), మొయిన్ అలీ(0), జో(77), బెయిన్ స్టో(50), బాల్ (2) పరుగులు చేశారు. కాగా, ఈ ఆరు వికెట్లలో జడేజా, అశ్విన్ లు చెరో రెండు వికెట్లు, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ భారత్ కనతే ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. ఓటమి పాలు కాకుండా ఉండాలంటే, రేపు జరిగే చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ తన చివరి వికెట్లను కాపాడుకుంటూ, పూర్తి స్థాయిలో పోరాడాల్సి ఉంది.

More Telugu News