: మావోయిస్టు దంపతుల లొంగుబాటు

మావోయిస్టు దంపతులు రాజు, స్వరూప పోలీసుల ఎదుట లొంగిపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీ చర్ల, వెంకటాపూర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యుడు కుక్కల గణపతి అలియాస్ రాజు, సభ్యురాలు చెన్నూరు సర్వక్క అలియాస్ స్వరూప దంపతులు లొంగిపోయినట్లు చెప్పారు. సుమారు దశాబ్ద కాలంగా మావోయిస్టు పార్టీలో వారు పనిచేస్తున్నారని, అనారోగ్య కారణాల వల్లే వారు లొంగిపోయారని భాస్కరన్ తెలిపారు.

More Telugu News