: ‘నోట్ల రద్దు’ సమస్యలను వెంటనే పరిష్కరించాలి..‘సుప్రీం’ ఆదేశాలు

‘నోట్ల రద్దు’తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నోట్ల రద్దు విషయంలో సామాన్యుడి కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించింది. నోట్ల రద్దు కారణంగా గ్రామీణులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

More Telugu News