: నేడు కొడాలి, పిన్నెల్లి వంతు... ప్రివిలేజ్ కమిటీ ముందుకు!

అసెంబ్లీలో జరిగిన రభసకు సంబంధించి తనకు ఇచ్చిన నోటీసులపై సమాధానం చెప్పేందుకు వైకాపా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నానిలు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు అసెంబ్లీకి వచ్చారు. గత సమావేశాల్లో పోడియంలోకి దూసుకెళ్లి, మార్షల్స్ పై చెయ్యి చేసుకుని, స్పీకర్ మైక్ ను లాగేసి గందరగోళం సృష్టించారన్న ఆరోపణలపై పిన్నెల్లి, కొడాలి పలువురు వైకాపా ఎంపీలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా ఎమ్మెల్యేలు గత నెలలో కమిటీ ముందు హాజరై తమ వివరణ ఇవ్వగా, వీరిద్దరూ నేడు హాజరు కానున్నారు.

More Telugu News