: ‘ఇప్పటికే ప‌లువురిపై చర్యలు తీసుకున్నాం’.. న‌ల్ల‌కుబేరుల‌కు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చిన ఆర్థికశాఖ

పెద్దనోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున జ‌రుగుతున్న అక్ర‌మాల నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక‌ శాఖ న‌ల్ల‌కుబేరుల‌కు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది. మనీ లాండరింగ్‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆ శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత దాస్ ఈ రోజు మ‌రోసారి హెచ్చరించారు. అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచామ‌ని ఇప్పటికే ప‌లువురిపై కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అన్నారు. ఆదాయ‌ ప‌న్ను శాఖ జ‌రుపుతున్న‌ దాడుల్లో పెద్దఎత్తున డ‌బ్బును స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులోనూ న‌ల్ల‌కుబేరులు ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే క‌ష్టాలు ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News