: బంద్ నుంచి బ్యాంకులకు మినహాయింపు... అయినా వీసమెత్తు ప్రయోజనం లేదు!

ఈ ఉదయం కొన్ని పార్టీలు భారత్ బంద్ కు, మరికొన్ని పార్టీలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ ప్రభావం చాలా స్వల్పంగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు యథాప్రకారం తిరుగుతున్నాయి. ఇదే సమయంలో బంద్, నిరసనల నుంచి బ్యాంకులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, అది ప్రజలకేమీ ఉపయోగపడటం లేదు. ఈ ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరచుకున్నప్పటికీ, ఏ బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో విత్ డ్రా కోసం వచ్చిన కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. దీంతో బంద్ నుంచి మినహాయింపు ఉన్నా, తమకు బ్యాంకుల వల్ల వీసమెత్తు ఉపయోగం లేకపోయిందని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, ఈ మధ్యాహ్నం తరువాత బ్యాంకులకు నగదు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

More Telugu News