: విద్యార్థినిపై హెడ్మాస్టర్ గత ఆరు నెలలుగా అత్యాచారం

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ హెడ్మాస్టర్ సమాజం సిగ్గుతో తలవంచుకునే పని చేశాడు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని (12)ని ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప భయపెట్టి గత ఆరు నెలలుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆ బాధిత బాలిక కడుపునొప్పి వస్తోందంటూ తన తల్లికి చెప్పింది. అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయాన్ని చెప్పింది బాధితురాలు. దీంతో, కామాంధుడైన హెడ్మాస్టర్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని పాతపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం రాత్రి ఆమెను బాగేపల్లి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం, చిక్కబళ్లాపూర్ లో నిన్న పరీక్షలు నిర్వహించి, మక్కళ కల్యాణ సమితికి అప్పగించినట్టు సమాచారం. మరోవైపు, నిందితుడు దుగ్గప్ప బాగేపల్లెలో ఉన్నట్టు సమాచారం అందడంతో... అక్కడకు వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

More Telugu News