: రజనీకాంత్, కమలహాసన్ రహస్య సమావేశం!

తమిళ సినీ నటదిగ్గజాలు రజనీ కాంత్, కమలహాసన్‌ లు రహస్యంగా సమావేశమయ్యారు. వీరి భేటీ కోలీవుడ్ లో ఆసక్తిని రేపుతోంది. నిన్న సాయంత్రం చెన్నైలోని ఆళ్వార్ పేటలోని కమల్ కార్యాలయానికి వచ్చిన రజనీ చాలా సేపు అక్కడ గడిపారు. కాగా, ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీ యూఎస్ వెళ్లి చికిత్స తీసుకోగా, ఆమధ్య తన కార్యాలయంలో జారిపడ్డ కమల్ ఆ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరకాల మిత్రులైన వీరిద్దరూ ఒకరినొకరు పరామర్శించుకుని, పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రజనీ 'రోబో .2' సీక్వెల్ లో నటిస్తుండగా, 'శభాష్ నాయుడు' చిత్రీకరణలో కమల్ బిజీగా ఉన్నారు.

More Telugu News