: టోల్గేట్ల వద్ద ‘సుంకం వసూలు రద్దు’ గడువు పొడిగింపు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే ప్రకటన చేసింది. టోల్గేట్ల వద్ద సుంకం వసూలు రద్దు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 అర్ధరాత్రి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 8న టోల్గేట్ల వద్ద ప్రధాని మోదీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో సుంకం వసూలు చేసే సమయంలో పెద్ద సమస్యే ఎదురైన సంగతి తెలిసిందే. జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం కూడా ఏర్పడింది. దీంతో టోల్గేట్ల వద్ద సుంకం వసూలు చేయకూడదని ప్రభుత్వం పలుసార్లు ప్రకటించాల్సి వస్తోంది.