: ఎస్ బీఐ ఏటీఎంలలో వందనోట్లు ఉంచుతాం.. రెండు వేల నోట్లు బ్రాంచ్ లకే పరిమితం: ఎస్ బీఐ చైర్ పర్సన్

ఎస్ బీఐ ఏటీఎంలలో వందనోట్లను మాత్రమే ఉంచుతున్నామని ఆ బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. రేపటి నుంచి ఎస్ బీఐ ఏటీఎంలు తెరచుకోనున్నాయని, ఖాతాదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్తగా విడుదల చేసిన రూ.2 వేల నోట్లను కేవలం బ్రాంచ్ లకు మాత్రమే పరిమితం చేశామని చెప్పారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించాలని, శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేస్తాయని పేర్కొన్నారు.

More Telugu News