: ముంబయి చేరుకున్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్
భారత్- ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ల మధ్య ఈ నెల 9వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సిరీస్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఇంగ్లండ్ జట్టు కొద్ది సేపటి క్రితం ముంబయి ఎయిర్పోర్టుకి చేరుకుంది. ఇంగ్లండ్, భారత్ మధ్య రాజ్కోట్లో ఈ నెల 9 నుంచి 13 వరకు మొదటి టెస్టు, విశాఖపట్నంలో ఈ నెల 17 నుంచి 22 మధ్య రెండో టెస్టు, మొహాలీలో ఈ నెల 26 నుంచి 30 వరకు మూడో టెస్టు జరగనుంది. ఇక వచ్చే నెల ముంబయిలో 8 నుంచి 12 మధ్య, చెన్నైలో డిసెంబరు 16 నుంచి 20 మధ్య నాలుగో, ఐదో టెస్టులు జరుగుతాయి. టెస్టుల్లో టీమిండియా 115 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 108 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.