: భూముల కబ్జా ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

భూముల కబ్జా ఆరోపణలపై నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. వావిలేటిపాడులో రెండు కోట్ల రూపాయల విలువ చేసే తమ భూములను ఆయన కబ్జా చేశారని జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News